జబర్దస్త్ షో కి ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ !


ఈటీవీలో గత కొన్నేళ్లుగా ప్రసారమవుతున్న జబర్దస్త్ షో సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. లాఫింగ్ స్టార్ నాగబాబు షో నుండి తప్పుకున్నా కూడా రోజా ఒంటి చేత్తో జబర్దస్త్ ని లాక్కొచ్చింది. ఇప్పుడు రోజా మినిస్టర్ అయ్యాక ఈ షో నుండి తప్పుకోక తప్పలేదు. రోజా వెనుకే టాప్ కమెడియన్స్ వరసబెట్టి జబర్దస్త్ ని వీడుతున్నారు. సుధీర్, ఆది, అవినాష్, అభి ఇలా అంతా వెళ్లిపోయారు. దానితో జబర్దస్త్ లో కళ పోయింది. సుధీర్, అది లు లేకపోవడంతో వరసగా సీరియల్ ఆర్టిస్ట్ లు జబర్దస్త్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తున్నారు.

మరోపక్క జబర్దస్త్ జడ్జీలుగా చాలామంది మాజీ హీరోయిన్స్ వచ్చి వెళుతున్నారు. ఇంద్రజ, లైలా, శ్రద్ద దాస్, మనో ఇలా రకరకాలుగా కనిపిస్తున్నారు. తాజాగా జబర్దస్త్ జడ్జీ ప్లేస్ లోకి కోలీవుడ్ నటి ఖుష్బూ సుందర్ ఎంట్రీ ఇచ్చారు. ఖుష్బూ చాలా మోడరన్ గా, గ్లామర్ గా ఇంద్రజ పక్కనే ఉండి కమెడియన్స్ పై సెటైర్స్ కూడా వేశారు. ఖుష్బూ సరదాగా బుల్లెట్ భాస్కర్ పై వేసిన సెటైర్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఖుష్బూ అయినా పర్మినెంట్ జడ్జీగా ఉంటుందా.. లేదంటే మిగతా వాళ్ళలా గెస్ట్ జడ్జీ గానే ఉంటుందా.. అనేది కొద్దిరోజులు పోతే తెలుస్తుంది.