గెట్ రెడీ.. పండక్కి వస్తున్న మహేష్ బాబు

మహేష్‌ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’గా వస్తున్న ఈ సినిమాను జనవరి 13 2024 లో వస్తున్నట్లు ప్రకటించారు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌ – త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సినిమాకు ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్‌ ఖరారైంది అనే వార్త చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర టైటిల్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘అమరావతికి అటు ఇటు’ ( ) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలవడలేదు . తమన్‌ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో మహేశ్‌ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.