కరోనా బారినపడిన మెగాస్టార్

కరోనా మహమ్మారి మరోసారి చిత్రసీమ ను వణికిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ లో భారీఎత్తున పలువురు సినీ ప్రముఖులు కరోనా బారినపడి ప్రాణాలు పోగొట్టుకోగా..మరికొంతమంది క్షేమంగా బయటపడ్డారు. ఇక మూడో వేవ్ లోను సినీ స్టార్స్ పెద్ద ఎత్తున కరోనా కు చిక్కుతున్నారు. తాజాగా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కరోనా బారినపడ్డారు. దీంతో అతడు హీరోగా నటిస్తున్న ‘‘సీబీఐ-5’’ సినిమా షూటింగ్ వాయిదా పడింది. తమ అభిమాన హీరో కోవిడ్ బారిన పడటంతో త్వరగా కోలుకోవాలని అభిమానులందరూ ప్రార్థిస్తున్నారు.

ప్ర‌స్తుతం తన ఆరోగ్యం బాగానే ఉంద‌ని తెలిపారు. అలాగే తాను ప్ర‌స్తుతం త‌న ఇంట్లోనే ఐసోలేష‌న్ లో ఉన్నాన‌ని అన్నారు. తాను క‌రోనా విష‌యంలో చాలా జ‌గ్ర‌త్త‌లు తీసుకున్నాన‌ని అన్నారు. అయినా.. క‌రోనా వైర‌స్ త‌న‌కు సోకింద‌ని తెలిపారు. కాగ త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారు అంద‌రూ కూడా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేసుకోవాల‌ని కోరారు.