పంతం ప్రీ రిలీజ్ కు హీరోయిన్ దూరం..

గోపీచంద్ , మెహ్రిన్ జంటగా నూతన దర్శకుడు కె.చ‌క్ర‌వ‌ర్తి దర్శకత్వంలో శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె. రాధామోహ‌న్ నిర్మాణం లో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. గోపీచంద్ 25వ చిత్రం గా వస్తున్న ఈ మూవీ ఫై గోపీచంద్ తో పాటు అభిమానులు , సినీ ప్రేక్షకులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సైతం ప్రేక్షకుల అంచనాలు రెట్టింపు చేసే విధంగా ఉండడం తో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. జులై 05 న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.

ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఈరోజు సాయంత్రం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక జరగనుంది. అయితే ఈ వేడుకకు హీరోయిన్ మెహ్రాన్ రాలేకపోతుంది. ప్రస్తుతం ఈమె వైరల్ ఫీవర్ తో బాధపడుతుందట. ఈ విషయాన్ని తెలుపుతూ మెహ్రీన్ ట్వీట్ చేసింది. ‘మీరెంతగానో ఎదురుచూస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఫీవర్ కారణంగా రాలేకపోతున్నా.. హైదరాబాద్ లో జులై 5న మనమంతా కలిసి సినిమా చూద్దాం’ అంటూ ట్విట్ చేసింది.

తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ ను పొందడం జరిగింది. కురుక్షేత్రం యుగానికి ఒక్కసారే జరుగుతుంది..అప్పుడే ధర్మం వైపు నిలబడాలో, అధర్మం వైపు నిలబడాలో అప్పుడే నిర్ణయం తీసుకోవాలి అంటూ ఓ పవర్ ఫుల్ డైలాగ్ ట్రైలర్ లో చూస్తుంటే సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కినట్లు అర్ధం అవుతుంది. మరి గత కొంతకాలం గా సరైన హిట్ లేని గోపీచంద్ కు ఈ మూవీ మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుందాం.