ఎన్టీఆర్ కొనుగోలు చేసిన ల్యాండ్ లో ఏంచేయబోతున్నాడంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసారు. రిజిస్ట్రేషన్ కోసం శనివారం స్వయంగా ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లారు. తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక ఈ ల్యాండ్ లో ఓ ఫామ్ హౌస్ కట్టబోతున్నాడట. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ భార్య ప్రణతికి అప్పగించాడు. ఆమె అభిరుచికి తగ్గట్టు ఆ ఫామ్ హౌజ్ ను అభివృద్ధి చేయాలనేది ఎన్టీఆర్ ఆలోచన. ఇదే ప్రాంతానికి దగ్గర్లో పవన్ కల్యాణ్ కు కూడా ఫామ్ హౌజ్ ఉన్న సంగతి తెలిసిందే.