‘నేనో రకం’ అంటున్న ఎన్టీఆర్ !

NTR-puriఎన్టీఆర్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. ’ఆంధ్రావాలా’ అనంతరం ఎన్టీఆర్-పూరీ జతకట్టడం ఇదే తొలిసారి. ఇటీవలే ఈ చిత్రం షూటింగులో ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. తాజాగా, టైటిల్ ని ఖరారు చేశారు. ’నేనో రకం’ అనే డిఫెరెంట్ టైటిల్ ను ఫైనల్ చేసినట్లు టాలీవుడ్ సమాచారమ్. ’కుమ్మేస్తా’, ’నేనో రకం’ అనే రెండు టైటిల్స్ పరిశీలనలో వున్నప్పటికినీ.. చివరికి ’నేనో రకం’ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సినిమా టైటిల్స్ పెట్టడంలో పూరీ స్టయిలే వేరు. ’నేనో రకం’తో అది మరోసారి రుజువైంది. డైలాగ్స్ కూడా డిఫరెంట్ మేనరిజంతో వుండనున్నాయట. ఎన్టీఆర్ కు జంటగా కాజల్ జతకట్టనుంది. ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ. కథ వక్కంతం వంశీ. బండ్ల గణేష్ నిర్మాత.