టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పంతం’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ 25వ చిత్రం కావడం తో దీని ఫై భారీ అంచనాలే పెట్టుకున్నారు సినీ ప్రేక్షకులు. జులై 05 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యం లో తాజాగా చిత్ర సెన్సార్ కార్య క్రమాలు ఈరోజు పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఈ మూవీ కి యూ/ ఏ సర్టిఫికెట్ జారీచేశారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ సైతం అందర్నీ ఆకట్టుకుంది. కురుక్షేత్రం యుగానికి ఒక్కసారే జరుగుతుంది..అప్పుడే ధర్మం వైపు నిలబడాలో, అధర్మం వైపు నిలబడాలో అప్పుడే నిర్ణయం తీసుకోవాలి అంటూ ఓ పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ను మొదలు పెట్టారు.. ట్రైలర్ అంత కూడా మంచి కామెడీ , యాక్షన్ , పవర్ ఫుల్ డైలాగ్స్ తో కట్ చేసారు. కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటూనే మంచి మెసేజ్తో కూడిన చిత్రం గా ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. గోపీచంద్ ఇప్పటి వరకు కనపడని క్యారెక్టర్లో సందడి చేసాడని తెలుస్తుంది. ఇక ఈ మూవీ లో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుండగా , గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
మరి వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న గోపీచంద్ కు ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఈ లోపు మీరు ట్రైలర్ ను చూసెయ్యండి.