పంతం ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

గోపీచంద్ , మెహ్రిన్ జంటగా నూతన దర్శకుడు కె.చ‌క్ర‌వ‌ర్తి దర్శకత్వంలో శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె. రాధామోహ‌న్ నిర్మాణం లో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. గోపీచంద్ 25వ చిత్రం గా వస్తున్న ఈ మూవీ ఫై గోపీచంద్ తో పాటు అభిమానులు , సినీ ప్రేక్షకులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సైతం ప్రేక్షకుల అంచనాలు రెట్టింపు చేసే విధంగా ఉండడం తో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. వరల్డ్ వైడ్ గా రేపు (జులై 05) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యం లో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి. మొత్తంగా సినిమా 14 కోట్లకు నిర్మాతలు చిత్రాన్ని అమ్మినట్లు తెలుస్తుంది. గోపీచంద్ కెరీర్ లో ఇది మినిమమ్ రేట్ అని అంటున్నారు.

ఇక ఏరియా వైజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు 0.45 కోట్లు
నైజాం 3.30 కోట్లు
సీడెడ్ 2.25 కోట్లు
ఉత్తరాంధ్ర 1.40 కోట్లు
ఈస్ట్ 0.80 కోట్లు
గుంటూరు 0.90 కోట్లు
కృష్ణ 0.70 కోట్లు
వెస్ట్ 0.70 కోట్లు

ఆంధ్రప్రదేశ్ + తెలంగాణ కలిపి మొత్తం 10.50 కోట్లు.

కర్ణాటక + తమిళనాడు + నార్త్ ఇండియా 1.10 అవుట్ రైట్
ఓవర్సీస్ 0.50 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా 12.10 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా ఖర్చులతో కలిపి 14 కోట్లకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది.