కాపురం చేయకపోతే ఫీల్ అవుతారంటూ సంచలన వాఖ్యలు చేసిన పూనమ్ కౌర్

ఏపీ లో వ‌కీల్ సాబ్ సినిమాకి టికెట్ రేట్లు పెంచకుండా ప్ర‌భుత్వం జీవో విడుదల చేసి ఆటంకాలు సృష్టించింద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తోన్న తరుణంలో దీనిపై సినీ న‌టి పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

సినిమాలకు, రాజకీయాలకు మధ్య ఉన్న సంబంధం అనేది పెద్దలు కుదిర్చిన పెళ్లిలాంటింద‌ని ఆమె ట్వీట్ చేసింది. అయితే, అది కొంత మంది వ్యక్తులకు కాకుండా ప్రజలకు మేలు చేకూర్చాల‌ని చెప్పుకొచ్చింది. కాపురం చేయకపోతే మాత్రం ఫీల్‌ అయ్యేది ప్రజలేన‌ని అంటూ ట్వీట్ చేసింది. మంచి కంటెంట్‌ ఉన్న సినిమాను ఎవరు చేసినా ఎంకరేజ్‌ చేయాలని పూనమ్ కౌర్ చెప్పింది. అంతేగానీ, డీ ఫేమింగ్‌ ఆర్గనైజ్డ్‌ ట్రెండ్‌ ఏంటో? అంటూ ప్ర‌శ్నించింది. ఇప్పుడు కుళ్లు రాజకీయాలు ఎవ‌రు చేస్తున్నారు? అని నిల‌దీసింది. అమ్మాయిలను డీఫేమ్‌ చేసి రాజకీయం చేస్తే తప్పు కాదని, అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లమ్‌ ఎవరికి? అని ప్ర‌శ్నించింది. చివ‌రికి పోసానిగారు ప్రెస్‌మీట్‌? అని పేర్కొంది.