తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు.ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో నెట్టింది. సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారీ, శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా?, బ్రహ్మోత్సవం, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు.
రాజబాబు సినిమాలతో పాటు పలు సీరియళ్లలో కూడా నటించి మెప్పించారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి తదితర సీరియళ్లలో నటించారు. 1957 జూన్ 13న రాజబాబు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో జన్మించారు.