సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం రాత్రి జరిగిన 2019 ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో సందడి చేసారు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ని అభిమానుల మధ్య కూర్చొని రజనీకాంత్ వీక్షించారు. రజనీకాంత్ గ్యాలరీలో ఉండడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. రజనీ తో సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. ప్రస్తుతం రజనీ ఫొటోస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.
2.ఓ, పేట చిత్రాల హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న రజనీకాంత్..ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి రానుంది. కీర్తి సురేష్ , నయనతార హీరోయిన్లుగా నటిస్తుండగా…అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి మ్యాచ్లో బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు వ్యూహం ఫలించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇచ్చిన 70 పరుగుల లక్ష్యచేధన కోసం బ్యాటింగ్కు దిగిన చెన్నై17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది.