అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప మూవీ పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. భారీ రేంజ్లో అల్లు అర్జున్ తొలి ప్యాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు సుకుమార్. అయితే ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందనుందని ముందే ప్రకటించిన సుకుమార్ ప్రస్తుతం రెండో భాగంపై పూర్తి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.
తొలి పార్ట్ని మించేలా రెండో పార్ట్ తెరకెక్కిస్తున్నట్టు ప్రచారం నడుస్తుంది. ‘పుష్ప ది రూల్’ షూటింగ్ను ఫిబ్రవరి నెలలో మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్ప 2 అంచనాలు మించి ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రష్మిక చేసిన ఆసక్తికర పోస్ట్ మూవీపై మరింత ఆసక్తిని పెంచింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రష్మిక నవ్వుతూ ఉన్న అందమైన ఫోటోను పోస్ట్ చేసింది. “పుష్ప పట్ల మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. ఈ ప్రేమ మమ్మల్ని మరింత కష్టపడి పని చేసేలా చేస్తుంది.. మేము మీకు వాగ్దానం చేస్తున్నాము.. పుష్ప 2 మరింత బిగ్గర్ గా, బెటర్ గా ఉంటుంది!” అంటూ పోస్ట్ చేసింది.