బాలీవుడ్ బాటపట్టిన రష్మిక !


వరుస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక..రీసెంట్ గా పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ భారీ విజయం అందుకుంది. ప్రస్తుతం రాధికా తన ఫోకస్ అంత బాలీవుడ్ పైనే పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సిద్ధార్ధ్ మల్హొత్రా హీరోగా మిషన్ మజ్ను, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న గుడ్ బై చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకోగా రణ్ బీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా కలయికలో రాబోతున్న యానిమల్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో వుండగానే రష్మిక మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. టైగర్ ష్రాఫ్ హీరోగా శశాంక్ ఖేతాన్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సెట్స్ పైకి వెళ్లబోతోంది.