దేవకట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. అక్టోబర్ 01 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసారు. సినిమా చుసిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీచేశారు.
జీ స్టూడియోస్ సమర్పణలో జె. బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు దేవ్ కట్టా దర్శకత్వం వహించారు. పొలిటికల్ సిస్టమ్ ను ఢీ కొట్టే ఐ.ఎ.ఎస్. అధికారి పంజా అభిరామ్ గా ఇందులో సాయి తేజ్ నటించాడు. ఐశ్వర్యా రాజేశ్, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.