‘ఎవడు’ తర్వాత !

saikuma
‘ఎవడు’ తర్వాత మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు సాయికుమార్. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించే ‘పటాస్’ సినిమాలో కళ్యాణ్ రామ్ కి తండ్రిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర చాలా పవర్ ఫుల్ పాత్ర అనీ, దానికి సాయికుమార్ సరిగ్గా సూట్ అవుతాడనీ అంటున్నారు. ఇందులో తండ్రీ కొడుకుల సెంటిమెంట్ సన్నివేశాలు హైలెట్ గా నిలిస్తాయి సమాచారం. ‘ఆగడు’ సినిమాకు రచయితగా పనిచేసిన అనిల్ రావిపూడి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి కళ్యాణ్ రామే నిర్మాత.