సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్ లో దుమ్ముపేలిన మహేష్ – బన్నీ

సాక్షి ఎక్స్లెన్స్ అవార్డు వేదికపై మహేష్ – బన్నీ దుమ్ము దులిపారు. నిన్న రాత్రి హైదరాబాద్‏లో జరిగిన ఈ అవార్డుల వేడుకలో మహేష్ మహర్షి , బన్నీ అల వైకుంఠపురం లో చిత్రాలు పలు అవార్డ్స్ దక్కించుకున్నాయి. అల వైకుంఠపురం సినిమాకు ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్.. ఉత్తమ నటిగా పూజా హెగ్డే.. ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్.. ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత రాధాకృష్ణ.. ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ అవార్డ్స్ అందుకున్నారు.

ఇక కార్యక్రమంలో ‘మహర్షి’ సినిమాకి వివిధ కేటగిరీలలో మూడు అవార్డులు లభించడం విశేషం. హీరో మహేశ్ బాబుకి బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. అలాగే బెస్ట్ డైరెక్టర్ అవార్డును వంశీ పైడిపల్లి సొంతం చేసుకున్నారు. ఇక బెస్ట్ ఫిల్మ్ అవార్డును నిర్మాత ‘దిల్’ రాజు అందుకున్నారు.