మహేష్ – త్రివిక్రమ్ మూవీ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ మొదలుపెట్టిన థమన్

త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నాడు, ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక త్రివిక్రమ్ తో సినిమా పట్టాలెక్కనుంది. కాగా ప్రస్తుతం ఈ మూవీ తాలూకా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ ను మొదలుపెట్టినట్లు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తెలిపారు.

త్రివిక్రమ్‌తో తమన్‌ చేస్తున్న మూడో చిత్రమిది. తాజాగా త్రివిక్రమ్‌తో దిగిన ఫొటోను షేర్‌ చేసి ‘‘సంక్రాంతి సందర్భంగా త్రివిక్రమ్‌, మహేశ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’ సినిమాకు మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ మొదలుపెట్టాం. మా మ్యూజికల్‌ జర్నీ ఇలా కొనసాగుతూనే ఉండాలి’’ అని తమన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మార్చిలో ఈ చిత్రం సెట్స్‌ మీదకెళ్లే అవకాశం ఉంది. ఇందులో మహేశ్‌ సరసన పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనుంది.