ప్రభాస్ కు ఐ లవ్ యు చెప్తానంటున్న విశాల్ మాజీ లవర్ ..

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌ ప్రభాస్ అంటే పడి చచ్చే అమ్మాయిలు చాలామందే ఉన్నారు…కేవలం సామాన్య అమ్మాయిలే కాదు హీరోయిన్స్ సైతం ప్రభాస్ అంటే ఇష్టమని పబ్లిక్ గా చెపుతూ వారి ఇష్టాన్ని తెలియజేస్తున్నారు.. తాజాగా ఈ లిస్ట్ లో హాట్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ చేరింది. గతంలోనే ప్రభాస్ అంటే ఇష్టమని , బాహుబలి తర్వాత ఆ ఇష్టం మరింత పెరిగిందని తెలిపిన ఈ భామ..మరోసారి తన మనసులోని కోర్కెలను తెలిపింది.

ప్రస్తుతం ‘నాగకన్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న ఈమె సినిమా విశేషాలతో పాటు ‘ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టమని.. తెలుగు హీరోల్లో తాను ప్రభాస్‌ను ఎక్కువగా అభిమానిస్తాను. నేను మాత్రమే కాదు ప్రస్తుతం దేశంలో ఎంతో మంది ఆయన్ను అభిమానిస్తూ ఉన్నారు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్ అయ్యా.. ప్రభాస్ స్టైల్, యాక్టింగ్ అంటే నాకు మహా పిచ్చి.. ప్రభాస్‌తో నటించే అవకాశం వస్తే క్షణం ఆలోచించకుండా ఓకే చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. అక్కడి తో ఆగకుండా నేను ఎవరికైనా ఐలవ్యూ చెప్పాలనుకుంటే అది బాహుబలి ప్రభాస్‌కే చెబుతానని మనసులో మాటను బయటపెట్టేసింది. ఈమె మాటలు విన్న అభిమానులు ప్రభాస్ కు ఐ లవ్ యు చెపితే విశాల్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు.

ఎందుకంటే కొన్ని రోజుల క్రితం విశాల్ తో ప్రేమాయణం సాగించిన వర లక్ష్మి..పెళ్లి వరకు వెళ్లారు. కానీ మళ్లీ ఏమైందో కానీ ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం విశాల్ హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మాన్ కూతురు అనీశాను పెళ్లి చేసుకోబోతున్నాడు.