వర్మ ప్రశ్నించాడు..

వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన సంచలనమే..ఒకరిని పొగిడిన..తిట్టినా ఏదైనా సరే ఆ ట్వీట్ ఆరోజంతా మీడియా లో , సోషల్ మీడియా లో వైరల్ కావాల్సిందే. గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో వర్మ హడావిడి మాములుగా లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పట్ల వర్మ చేస్తున్న కామెంట్స్ కొంతమందికి ఆనందం కలిగిస్తుంటే ..మరికొంతమందికి కోపం తెప్పిస్తున్నాయి.

తాజాగా వర్మ ఎన్నికల్లో గెలిచిన వారికీ ఓడిపోయినా వారు విషెష్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. గెలిచిన పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పడం సహజమే కదా. అలా చెప్పేవాళ్ళల్లో ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు కూడా ఉండొచ్చు. ఈ పాయింట్ పై వర్మ ఓ ట్వీట్ చేశారు. ఓడిన వ్యక్తులు గెలిచిన వాళ్లకు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి… ఓడిపోయినందుకు బాధ ఉండాలి.. లేదంటే కోపం ఉండాలి. ఇలా శుభాకాంక్షలు చెప్పడం ఏంటి అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.