Chaari 111 : అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న వెన్నెల కిషోర్ ‘చారి 111’..


వినోదంలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరించే వెన్నెల కిషోర్ ‘చారి 111’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. స్పై, యాక్షన్, కామెడీ మూవీగా దర్శకుడు టీజీ కీర్తి కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించారు. సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళీ శర్మ, తాగుబోతు రమేష్, సత్య కీలక పాత్రల్లో నటించారు.

Mahesh Babu : ఇంతలా ఎప్పుడు నవ్వానో కూడా గుర్తులేదు.. ‘ప్రేమలు’ సినిమాపై మహేష్ బాబు

ఇకపోతే మార్చి 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. డేట్ మాత్రం చెప్పలేదు. ఇక మార్చి 16 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే అమెజాన్ ప్రైమ్ తో పాటు ఆహా లో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం వుంది.