పంజా డైరెక్టర్ తో ఉప్పెన హీరో..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పంజా అనే భారీ డిజాస్టర్ తెరకెక్కించిన డైరెక్టర్ విష్ణువర్ధన్..ఇప్పుడు ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ తో ఓ మూవీ చేయబోతున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. పంజా తర్వాత మరో అవకాశం తెలుగులో రాలేదు విష్ణు కు. కానీ తాజాగా ఈయన బాలీవుడ్ లో షేర్ షా తో భారీ హిట్ కొట్టేసరికి మళ్లీ ఈయన పేరు వినిపిస్తుంది.

ఈ తరుణంలో విష్ణు దగ్గర ఉన్న కథ ..వైష్ణవ్ కు బాగా కుదురుతుందని..ఓ నిర్మాత చెప్పడం..వైష్ణవ్ కూడా ఓకే చెప్పడం జరిగిందని అంటున్నారు. మరి ఆ నిర్మాత ఎవరు అనేది తెలియాల్సి ఉంది. వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో కొండా పాలెం మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.