ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కొత్తగా 4228 కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 35,582 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,228 కేసులు నిర్ధారణ కాగా తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,32,892 మంది వైరస్‌ బారిన పడగా మొత్తం 25,850 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 1,483 మంది కరోనా నుండి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులు అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 8,99,721 కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ తో 10 మంది మరణించారు, దీంతో రాష్ట్రంలో కొవిడ్ వల్ల 7,321 మంది మరణించారు.