కేసీఆర్ రాజ్ భవన్ రాజకీయం


రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఎప్పుడూ తక్కువ సమయం జరిగే సమావేశం.. ఈసారి రెండు గంటలపాటు జరిగింది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఇంతసేపు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.

ఇదిలావుంటే కేసీఆర్ కు ప్రజా సమస్యలు ఏవీ పట్టవనీ, ఆయనకు ఫామ్ హౌస్ లో కూర్చుని మందుకొట్టడం మాత్రమే తెలుసనికాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని తాగుబోతు సీఎం నుంచి విముక్తి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం శివ్వంపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రోడ్ షో లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.