2015 ‘పద్మ’ అవార్డుల లిస్ట్ …

padma-awards‘భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. 9 మందికి పద్మవిభూషణ్, 20 మందికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ మొత్తం 104 మందికి ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆరుగురు తెలుగు వారు పద్మశ్రీ అవార్డులకు ఎంపికయ్యారు.

పద్మవిభూషణ్ పొందినవారి లిస్ట్ :

ఎల్ కే అద్వానీ, అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్, ప్రకాష్ సింగ్ బాదల్, కొట్టాయన్ కె వేణుగోపాల్, వీరేంద్ర హెగ్డే, ప్రొఫెసర్ మల్లార్ రామస్వామి, కరీమ్ ఆల్ హుసేని ఆగా ఖాన్,

పద్మభూషణ్ పొందినవారి లిస్ట్ :
బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్, సినీ నిర్మాత జాను బారువా. సత్పాల్, శివకుమార్ స్వామి, రంజిత్ శర్మ, స్వపన్ దాస్ గుప్త, మాజీ సీఈసీ ఎన్ గోపాలస్వామి, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సీ కస్యప్, న్యాయవాది హరీష్ సాల్వే, విజయ్ భక్తర్, కార్డియాలజిస్ట్ అశోక్ సేత్, ఆచార్య మంజుల్ భార్గవ్

పద్మశ్రీ పొందినవారి లిస్ట్ :

కోట శ్రీనివాసరావు, డాక్టర్ అనగాని మంజుల, పాటల రచయిత జోషి, టీవీ మోహన్ దాస్, పీవీ సింధు, మైథిలిరాజ్, నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాముడు, ఆధ్యాత్మిక గురువు దివంగత సైయద్ మెహ్మద్ బుర్హానుద్దీన్.. వీరికి కేంద్రం అవార్డులు అందించనుంది.