ఆల్ పార్టీ గందరగోళం !

all party meetingతెలంగాణపై మరో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించడంతో రాష్ట్ర కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడతాఏమోనన్న ఆందోళనలో ఆప్రాంత నేతలు ఉంటే..తమ అభిప్రాయలను వివరించడానికి ఓవేదిక దొరికిందని సీమాంధ్ర నేతలు ఆనందపడుతున్నారు. కేవలం మంత్రుల కమిటీ విధివిధానాలపైనే అఖిలపక్షం వస్తుందని తెలంగాణ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఈసారైనా అన్నిపార్టీలు సమైక్యాంధ్రపై స్పష్టమైన అభిప్రాయాన్ని ఆల్ పార్టీ మీటింగ్ లో చెప్పాలని సీమాంధ్ర నేతలు కోరుతున్నారు.