మాజీ ఎంపీ ఆనంద గజపతిరాజు ఈరోజు ఉదయం కన్నుమూశారు. విశాఖలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కేంద్రమంత్రి అశోక్గజపతిరాజు సోదరుడైన ఆనంద గజపతిరాజు ప్రస్తుతం మాన్సాస్ సంస్థ ఛైర్మన్గా పనిచేస్తున్నారు. రెండు సార్లు రాష్ట్రమంత్రిగా, రెండు సార్లు ఎంపీగా పనిచేశారు.