జగన్ అప్పుడే పోస్ట్ పెట్టేసాడే..

ఎప్పుడెప్పుడా అని నెల రోజులుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. రోజుల్లో ఉన్న ఎన్నికల ఫలితాలు గంటల్లోకి వచ్చాయి. రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి ఎన్నికల లెక్కింపు మొదలు కాబోతుంది. దేశ పరిస్థితి ఎలా ఉందనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఎవరిదా అనేది అందరిలో ఆసక్తి. గెలుపు మాదంటే మాదే అని తెలుగు దేశం , వైస్సార్సీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఇక ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి మెజార్టీ సీట్లు వస్తాయంటూ జాతీయ మీడియా సంస్థలు చెప్పడం.. పార్టీ కేడర్‌లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫుల్ జోష్ నింపాయి. అదే ధీమాతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.. రాజన్న రాజ్యం రాబోతోందని.. సుపరిపాలన అందించడమే తన సంకల్పమని పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది.

ఇక ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి మెజార్టీ సీట్లు వస్తాయంటూ జాతీయ మీడియా సంస్థలు తేల్చాయి. పార్టీ కేడర్‌లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫుల్ జోష్ నింపాయి. అదే ధీమాతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు.. రాజన్న రాజ్యం రాబోతోందని.. సుపరిపాలన అందించడమే తన సంకల్పమన్నారు.

జగన్ గెలుపు ధీమా పోస్ట్ పెట్టేసరికి కార్య కర్తల్లో , అభిమానుల్లో సంబరాలు మాములుగా లేవు..ఇప్పుడే ఇలా ఉంటె రేపు ఎలా ఉంటాయో అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి జగన్ కల ఎంత మేరకు నెరవేరుతుందనేది రేపు తెలుస్తుంది.