పాల్‌గారి పార్టీ వైసీపీ కొంప ముంచుద్దా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ చక్రం తిప్పుతుందని..కాబోయే సీఎం జగనే అని..ప్రజలు..సర్వేలు చెపుతున్నప్పటికీ జగన్ లో మాత్రం భయం ఉంది..అది టీడీపీ వల్ల కాదు..ప్రజాశాంతి పార్టీ వల్ల. కేఏ పాల్ పెట్టిన ఈ పార్టీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు..కాకపోతే ఈ పార్టీ గుర్తు హెలికాఫ్టర్..అలాగే వీరి జెండా కూడా వైసీపీ పార్టీ జెండా మాదిరిగానే ఉండడం తో జగన్ భయపడుతున్నాడు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ద్వారా తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన ప్రజాశాంతి పార్టీ అధినేత, కేఏ పాల్ తన ఎన్నికల గుర్తుతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అత్యంత వ్యూహాత్మకంగా ఒకే అభ్యర్ధి పేరుతో పాటు వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌కు దగ్గరగా ఉండేలా హెలికాఫ్టర్ తెచ్చుకున్నాడు. వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లున్న వ్యక్తులను వెతికి మరి పోటీకి దించారు. దీంతో వైసీపీ పార్టీ లో భయం పట్టుకుంది..ఎంత వేరే పార్టీయినా జనాలకు ఆ పార్టీ గుర్తు వైసీపీ పార్టీ గుర్తు ఒకేలా ఉండడం తో ప్రజలు కాస్త గందరగోళానికి గురి కావడం ఖాయం.

పోలింగ్ బూత్ కు వెళ్లిన ప్రజలు రెండు ఒకేలా ఉండడం తో దేనికో ఓ దానికి తమ ఓటు వేసి వస్తారు. దీనివల్ల వైసీపీ కి పడాల్సిన ఓట్లు ప్రజాశాంతి పార్టీకి పడడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. ప్రజాశాంతి పార్టీ గుర్తు తమ పార్టీ సింబల్‌ను పోలి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ వారు కూడా చేతులు ఎత్తేయడం తో వైసీపీ కాస్త ఖంగారు మాత్రం నెలకొని ఉంది. మరి పాల్ పార్టీ వైసీపీ కొంప ముంచుద్దా లేదా అనేది చూడాలని అంటున్నారు.