ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా వేడుకల్లో పాల్గొని తమ దేశ భక్తిని చాటుకున్నారు. హైదరాబాద్ లో పబ్లిక్‌ గార్డెన్స్‌లో త్రివర్ణ పతాకాన్ని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఆవిష్కరించారు.

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే..ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌‌తోపాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.