టీడీపీ ఓటమి కంటే వర్మ చేసే కామెంట్స్ పార్టీ శ్రేణులను తీవ్రంగా బాధపెడుతున్నాయి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలి మాములుగా వీయలేదు..ఈ ఫ్యాన్ గాలి స్పీడ్ కు సైకిల్ టైర్ పంచర్ అయ్యింది..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 స్థానాల్లో వైస్సార్సీపీ విజయ కేతనం ఎగరవేసింది. ఇంత ఘోరంగా ఓటమి చెందుతామని తెలుగుదేశం పార్టీ కలలో కూడా ఊహించుకోలేదు. ఓటమి అయితే ఏదో 10 – 15 సీట్ల తో పోతామేమో అనుకుంది కానీ..24 సీట్లకే పరిమితం అవుతామని అనుకోలేదు. ఈ ఓటమి ని పార్టీ నేతలు , కార్య కర్తలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ పక్క పార్టీ దారుణంగా ఓడిపోయిందని బాధపడుతుంటే..పుండు మీద కారం చల్లినట్లు వర్మ తన ట్విట్టర్ లో కామెంట్స్ , పిక్స్ పెట్టి మరింత బాధపెడుతున్నాడని వాపోతున్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజ్ కాకుండా అడ్డుకోవడంతో వర్మ వీలు దొరికినప్పుడల్లా సెటైర్లు వేస్తుండేవాడు. ఈరోజు ఫలితాలు వెలువడుతున్న సమయంలో వర్మ తన ట్విట్టర్ ద్వారా బాబు గురించి సెటైరికల్ ఫోటోను పోస్ట్ చేశాడు. అందులో సైకిల్ చక్రం వెనుక దిగాలుగా కూర్చొని ఉన్న ఫోటో అది. ఆ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది. అది మాత్రమే కాదు గతంలో లోకేష్ తెలుగుదేశం పార్టీ కి ఓటు వెయ్యద్దని ప్రచారం చేసిన వీడియో , పసుపు – కుంకుమ తీసుకొని ఉప్పు కార పూసిన ఏపీ మహిళలు , కేసీఆర్ రిటన్ గిఫ్ట్ అనే పిక్ ఇలా రకరకాల పోస్టులు పెట్టి మరింత బాధకు గురి చేస్తున్నారు. ఓవరాల్ గా మే 23 , 2019 తెలుగుదేశం మరచిపోలేని రోజు.