దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో కమలం హావ చూపించగా ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాన్ గాలి గట్టిగా వీసింది. ఈ ఎన్నికల్లో సినీ, రాజకీయ స్టార్స్ కు ప్రజలు కోలుకోలేని దెబ్బ తీశారు. ఖచ్చితంగా గెలుస్తారని అనుకున్నవారంతా ఓడిపోయారు. వీరి ఓటమిని అభిమానులు , పార్టీ కార్య కర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక ఓటమి చెందిన ప్రముఖులు ఎవరా అంటే..
* సురేష్ గోపి (బీజేపీ)- త్రిస్సూర్
* ప్రకాశ్ రాజ్ (ఇండిపెండెంట్)-బెంగళూరు సెంట్రల్
* సిద్ధరామయ్యతో నిఖిల్ గౌడ (జేడీఎస్)-మాండ్యా
* జ్యోతిరాధిత్య సింధియా(కాంగ్రెస్)- గుణ
* మెహబూబా ముఫ్తీ (పీడీపీ)-అనంత్ నాగ్
* దిగ్విజయ్ సింగ్ (కాంగ్రెస్)-భోపాల్
* శత్రుఘ్న సిన్హా (కాంగ్రెస్)- పాట్నా సాహిబ్
* కన్హయ్యకుమార్ (బెగూసరాయ్)-సీపీఐ
* జయప్రద (బీజేపీ)-రాంపూర్
* ఊర్మిల మటోండ్కర్ (కాంగ్రెస్)-ముంబై నార్త్
* నాగబాబు (జనసేన)-నర్సాపురం
* కే ఏ పాల్
* లక్ష్మీనారాయణ (జనసేన)-విశాఖపట్నం
* పవన్ కళ్యాణ్ (జనసేన)-గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాలు
* నారా లోకేశ్ (టీడీపీ)- మంగళగిరి అసెంబ్లీ
* హెచ్డీ దేవెగౌడ (జేడీఎస్)-తుమకూరు
* రాహుల్ గాంధీ (కాంగ్రెస్)-అమేథీ
* కవిత (టిఆర్ఎస్) – నిజామాబాద్