టీడీపీ మరణించిన రోజు..

మే 23 , 2019 న తెలుగుదేశం పార్టీ మరణించిన రోజు అని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 152 స్థానాల్లో ఆధిక్యం ఉండగా ..తెలుగుదేశం పార్టీ 22 స్థానాల్లో ఉంది. ఇప్పటికే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని తేలిపోయింది.

ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మరోసారి తెలుగుదేశం ఫై తన కసిని అంత చూపించాడు. మే 23తో టీడీపీ అంతమైపోతుందంటూ ఆయన ట్వీట్ చేశారు. పేరు టీడీపీ.. ఆవిర్భావం మార్చి 29, 1982. మరణం మే 23, 2019 అంటూ వర్మ ట్వీట్ చేశారు. టీడీపీ ఓటమికి గల కారణాలను కూడా టీడీపీ మరణానికి కారణాలంటూ వర్మ చెప్పుకొచ్చారు. అబద్ధాలు, వెన్నుపోట్లు, అవినీతి, అశక్తత, వైఎస్ జగన్, నారా లోకేశ్ కారణాలని వర్మ ట్వీట్ చేశాడు.