‘మహాకూటమి’ బలం పెరిగింది !

తెలంగాణలో ‘మహాకూటమి’ బలం పెరిగింది. అవును.. ఇది నిజం. ఈ కూటమిలో కొత్తగా మరో పార్టీ చేరింది. కాంగ్రెస్, టీడీపీ, టీజెఎస్, సీపీఐ కలసి మహాకూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కూటమిలో ఆల్ ఇండియా ముస్లిం నేషనల్ లీగ్ పార్టీ కూడా చేరింది. ‘మహాకూటమి’ మద్దతిస్తున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఘనీ తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అబ్దుల్ ఘనీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలని మోసం చేశారని మండిపడ్డారు. ముస్లింలను మోసం చేసిన టీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యం. అందుకే మహాకూటమికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. మరీ.. మహాకూటమిలో చేరిన ఆల్ ఇండియా ముస్లిం నేషనల్ లీగ్ పార్టీ ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.