ఏపీ ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి.. ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను బుధువారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం 1,75,8687 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. టెస్ట్‌కు 1,66,460 మంది విద్యార్థులు హాజరయ్యారని.. వారిలో 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని వెల్లడించారు. ఇక విద్యార్థుల రెస్పాన్స్ షీట్ లను ఈ నెల 26 నుంచి డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తామన్నారు.

అలాగే… రేపటి నుంచి వెబ్సైట్ లో ర్యాంక్ కార్డులు అందుబాటు లో ఉంటాయని తెలిపారు. ఈ నెల 18 వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుందని తెలిపారు. గత రెండేళ్లతో పోల్చుకుంటే అర్హులైన విద్యార్థుల శాతం తగ్గిపోయింది.. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య మాత్రం పెరిగినట్టు వెల్లడించారు.. పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులకు, సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు