ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వాళ్ళకి కూడా సెమిస్టర్ విద్య అమలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తీసుకురావాలని నిర్ణయించింది. పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి 9వ తరగతి వరకు రెండు సెమిస్టర్‌ల విధానాన్ని తీసుకురానున్నారు. అయితే పదో తరగతికి మాత్రం 2024-25 విద్యా సంవత్సరం నుంచి సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు.