విద్యార్థులకు సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు రేపటి నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో కరోనా విస్తరిస్తునందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షలు యధాతధంగా జరుగుతాయి అని అన్నారు. అలాగే 10 వ తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారమే జరుతాయి అని పేర్కొన్నారు.