బీజేపీ కార్పొరేటర్ల అరెస్టు

bjp Corporaters arrestజీహెచ్‌ఎంసీలో నిన్నటి నుంచి ఆందోళన చేస్తున్న బీజేపీ కార్పోరేటర్లను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేయడంపై బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. గత రాత్రి నుంచి జీహెచ్ ఎంసీలోనే ఆరుగురు కార్పొరేటర్లు నిరసన తెలిపారు. కార్పొరేటర్ల అరెస్టుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశాన్ని నిర్వహించకపోతే.. సరియైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని జీహెచ్ ఎంసీ హెచ్చరించింది.