జూబ్లీహిల్స్ లో పెద్దఎత్తున బీజేపీ నేతల అరెస్ట్


హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద శుక్ర‌వారం తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. అమ్నిషియా ప‌బ్‌లో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్ నిందితుల‌ను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ నేత‌లు,కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా #BJP శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌లోకి ప్ర‌వేశించాయి. ఈ ఘటనను నిరసిస్తూ ధర్నా చేస్తున్న బిజెపి నాయకులను అరెస్ట్ చేసారు. అరెస్టయిన వారిలో మాజీ ఎమ్మెల్యే శ్రీ చింతల రాంచంద్రా రెడ్డి, బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి గీతామూర్తి, బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భానుప్రకాశ్, బిజెపి సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ గౌతంరావు, బీజేవైఎం నాయకులు అనంత కృష్ణ సహా 300 మంది బిజెపి కార్యకర్తలు ఉన్నారు.