బీజేపీ ఎమ్మెల్యే నాలుకలు కోస్తాడట !


బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కాడు. గోవుమాంసం తినేవాళ్ల నాలుకలు కోస్తామంటూ హెచ్చరికలు చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాం. ప్రస్తుతం పాత బస్తీలో ప్రచారం కొనసాగుతోంది. అక్కడ మంచి స్పందన వస్తుందని తెలిపారు రాజా సింగ్.

రాజా సింగ్ చేసిన నాలుకలు కోస్తాం అనే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ముస్లిం నేతలు రాజాసింగ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. దీనిపై ఎన్నికల సంఘానికి, పోలీసు స్టేషన్ లోనూ రాజా సింగ్ పై ఫిర్యాదులు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజాసింగ్ కు కొత్తేమీ కాదు. రెబల్ లీడర్ గా పేరున్న రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు చేసిన సందర్భాలున్నాయి.