బిజెపికి సిద్ధూ బైబై.. ఆప్ లో చేరిక

siddu
మాజీ క్రికెటర్, బిజెపి నేత, ఎంపీ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. కొద్దీ సేపటి క్రితమే ఆయన తన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్‌ కు ఇవ్వగా ఆయన ఆమోదం తెలిపారు. త్వరలోనే ఆయన ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. రానున్న పంజాబ్ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అక్కడ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. సిద్దూ నాయకత్వంలోనే ఆప్ ముందుకు వెళ్లనుందని చెబుతున్నారు. ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను ప్రకటించే అవకాశం ఉన్నట్లు కధనాలు వస్తున్నాయి. సిద్దూ భార్య నవజ్యోత్‌ కౌర్‌ కూడా త్వరలోనే బిజెపికి గుడ్ బాయ్ చెప్పేస్తారని తెలుస్తోంది.