డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో మహ రావు ఫూలే జయంతి

మహాత్మా జ్యోతి రావు ఫూలే 195వ జయంతి సందర్భంగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాంగణంలో “మహాత్మా జ్యోతి రావు ఫూలే” చిత్రపటానికి ఘనంగా పుష్ప నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ డైరెక్టర్ (అకాడమిక్) ప్రొ.ఇ.సుధారాణి, రిజిస్ట్రార్ డా.జి. లక్ష్మా రెడ్డి, బి.సి.సెల్ కో – ఆర్డినేటర్ డా.పి.వెంకటరమణ, AVPRC ఇంచార్జి డైరెక్టర్ డా.వడ్డాణం శ్రీనివాస్, యూనివర్సిటీ ఇంజినీర్ లక్మీ ప్రసాద్, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు.