Chandrababu Naidu : ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయం


వైకాపా ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో రోజురోజుకీ వ్యతిరేకత పెరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విషయం సీఎంకు అర్థమైందని ఓటమి భయం జగన్‌ను వెంటాడుతోందని విమర్శించారు. మే లేదా అక్టోబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా, అనే ఆలోచనలో పడ్డారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు.