ఢిల్లీకి సీఎం-తెలంగాణపైనే చర్చ!

cm-kiran-telanganaముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం నుండి పిలుపు రావడంతో ఈరోజు (సోమవారం) ఉదయం ఢిల్లీ వెళ్తున్నారు. ఇదివరకే కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్వ్య వహారాల ఇన్ ఛార్జ్ ఆజాద్ ప్రకటించినట్టుగా తెలంగాణ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, ఇతర ముఖ్య నేతలో చర్చించాలని చెప్పిన విషయం తెలిసిందే. ఆజాద్ ప్రకటనలో భాగంగానే సీఎంను ఢిల్లీకి పిలిపించినట్టు సమాచారం. తెలంగాణ అంశంపై సంప్రదింపులతోపాటు రాష్ర్టంలోని ఇతర పరిస్థితులపై చర్చించేందుకు సీఎంను ఢిల్లీ పిలిపించినట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ఆజాద్, షిండేలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం.

పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యేనారాయణను కూడా మరో రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఈ మూడు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలకు పిలుపు వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణపై కొద్దిరోజులుగా కాంగ్రెస్ కోర్ కమిటీతో సహా వివిధ స్థాయిల్లో విస్తృతంగా చర్చలు, సంప్రదింపులు జరుగుతున్న విషయం తెలిసిందే.