తెలంగాణ ప్రభుత్వానికి మరో గౌరవం దక్కింది.

promisingstateawardభారతదేశపు 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు దక్కింది. సీయన్‌బీసీ టీవీ 18 ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్‌లో భాగంగా తెలంగాణను మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 30 న ఢిల్లీలో సీయన్‌బీసీ లో జరగనుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సీయన్‌బీసీ అవార్డును స్వీకరించనున్నారు.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు ఈ అవార్డు నిదర్శనమని, . పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరుచేస్తూ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం అనుకూల వాతావరణం ఏర్పాటు చేసింది. అలాగే టీ హబ్ పేరుతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్టార్ట్పప్స్ పెట్టేలా రాష్ట్రప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.