ప్రజలకు ఏమి సందేశం ఇద్దామని అనుకుంటున్నారు : డీకే అరుణ

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఆరోపించారు. బుధవారం దీనికి సంభందించి పత్రికా ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, తెలంగాణ ఉద్యమ సమయంలో నిజాయితీగా పోరాడిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై తెరాస నాయకులు ఇష్టా రాజ్యాంగ మాట్లాడుతూ ,ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు.

సంతలో కూరగాయలు కొంటునట్లు ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేస్తూ, తెలంగాణ ప్రజలకు ఏమి సందేశం ఇద్దామని అనుకుంటున్నారో తెరాస నాయకులు సమాధానం చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఈటెల కోసం పని చేస్తున్న కార్యకర్తల పై దాడులు చేస్తున్నారని, అయితే ఇక పై వాటిని సహించేది లేదన్నారు డీకే అరుణ. జాతీయ, రాష్ట్ర పార్టీ మొత్తం ఈటెల వెంట ఉన్నారన్న విషయం తెరాస నాయకులు మరవద్దని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు గుర్తు చేశారు.

పోలీసులు హుజురాబాద్ లో వ్యవహరిస్తున్న తీరు యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకునేలా ఉందని , వారు ప్రభుత్వ ఉద్యోగులమన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని అరుణ అన్నారు. కేవలం బీజేపీ పార్టీ నాయకులే కాదు యావత్ తెలంగాణ ప్రజలు ఈటెల గెలుపును కోరుకుంటున్నారని, దాన్ని కోసం అందరూ స్వచ్ఛందంగా హుజురాబాద్ కు వచ్చి ఈటెల గెలుపు కోసం కృషి చేస్తున్నారని డీకే అరుణ తెలిపారు.