దసరా తర్వాత ‘కారు’ ఎక్కనున్న ఎర్రబెల్లి..?

Errabelli-Dayakar-Raoతెలుగుదేశం పార్టీ శాసన సభాపక్ష నేత ఎర్రబిల్లి దయాకర్ రావు మొన్న రాత్రి రహస్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో మంతనాలు జరిపరిపారని , పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలు గుసగుసలాడుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తనకు టిడిపిని వదిలే ఆలోచన లేదని, జీవితాంతం అదే పార్టీలో కొనసాగుతానని ఎర్రబెల్లి చెప్పినప్పటికి తాజాగా వెలువడుతున్న కధనాలను బట్టి ఎర్రబెల్లి దసరా తర్వాత టిడిపిని వీడి తెరాసలో చేరనున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.

అయితే దీనిపై పరకాల టిడిపి ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లి తెరాసలోకి చేరుతున్నట్లుగా స్పష్టం చేశారు. తనను కూడా ఎర్రబెల్లి తెరాస లోకి రావాల్సిందిగా ఆహ్వానించారని, అయితే ఆ ఆఫర్ ను తాను తిరస్కరించానని ధర్మారెడ్డి తెలిపారు. ఇక దసరా తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు సైకిలు దిగి తెరాస తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయనతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్ళే ప్రయత్నంలో ఎర్రబెల్లి ఉన్నట్లుగా సమాచారం.