తెరాస ఫై ఈటెల విజయఢంకా..

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు. మొత్తం 22 రౌండ్ల లో 20 రౌండ్ లలో ఈటెల ఆధిక్యం కనపరుస్తూ వచ్చారు. ఓవరాల్ గా 20 రౌండ్ లలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెళ్లు శ్రీనివాస్ పై ఏకంగా 23,865 ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఈటల రాజేందర్‌.. హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించడం ఇది ఏడో సారి కావడం విశేషం.

2004 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. మూడుసార్లు ఉప ఎన్నికల్లో.. నాలుగు సాధారణ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. అధికార పార్టీ నుంచి వీడి.. కమలతీర్థం పుచ్చుకున్న ఈటల కాషాయం కండువాతో శాసనసభలో అడుగుపెట్టనున్నారు.