బండ్ల గణేష్ కు టికెట్ వస్తుందా..?

చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సినీ ప్రయాణం మొదలు పెట్టిన బండ్ల గణేష్..ఆ తర్వాత క‌మెడియ‌న్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం వరకు కమెడియన్ గా కెరియర్ సాగించిన ఈయన, 2009 లో రవితేజ తో ఆంజనేయులు సినిమాను నిర్మించి నిర్మాతగా మారాడు. మొదటి చిత్రం పెద్దగా లాభాలను తేకపోయినప్పటికీ ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు , అల్లు అర్జున్ , ఎన్టీఆర్ లతో ఒక్కో సినిమా చేసి అతి తక్కువ టైం లోనే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం నిర్మాణానికి దూరంగా ఉంటున్న బండ్ల గణేష్, తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ నేత అయ్యాడు. బండ్ల గణేష్ కాంగ్రెస్ గూటిలో చేరడం వెనుక ఓ ఛానల్ అధినేత ఉన్నాడని , ఇప్పుడు గణేష్ కు రాజేంద్ర నగర్ టికెట్ కోసం ఆయన తెరవెనుక మత్తనాలు చేస్తున్నాడని వినికిడి. మరోపక్క లగడపాటి, బొత్స సత్యనారాయణ సైతం కాంగ్రెస్ లో తమకు వున్న పరిచయాలతో మాటసాయం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మహాకూటమి లో కీలకంగా ఉండడం తో గణేష్ కు రాజేంద్ర నగర్ టికెట్ వస్తుందా రాదా అనేది తెలియాల్సి ఉంది.