Gujarat First Phase Elections : నేటితో ముగియనున్న ప్రచారం


గుజరాత్ మొదటి దశలో జరిగే ఎన్నికలకు ప్రచారం నేటి సాయంత్రం ముగియనున్నది. 89 స్థానాలకు జరిగే ఈ తోలి దశ కోసం అన్ని రాజకీయ పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు సోమ్‌నాథ్, భావ్‌నగర్, నవ్‌సారిలో ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే హోంమంత్రి అమిత్ షా కూడా ఈ రోజు పలు చోట్ల ఎన్నికల సభల్లో పాల్గొంటారు. డిసెంబరు 1 గురువారం నాడు మొదటి దశ పోలింగ్ జరుగుతుంది.