హైదరాబాద్ UIDAI డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా శ్రీమతి పి.సంగీత, IAS నియామకం

భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (UIDAI) హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయానికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా శ్రీమతి పి.సంగీత నియమితులయ్యారు . శ్రీమతి పి.సంగీత 2004బ్యాచ్ కి చెందిన IAS అధికారిని . తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలు మరియు అండమాన్-నికోబార్ దీవులకు సంబంధించిన ఆధార్ సంబంధిత వ్యవహారాలను శ్రీమతి పి.సంగీత పర్యవేక్షిస్తారని భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (UIDAI) ఒక ప్రకటనలో తెలిపింది.